కోవిడ్: 24 గంటల్లో 10 వేలకు పైగా కొత్త కేసులు

భారత్‌లో గత 24 గంటల్లో 10,542 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 63,562.

లైవ్ కవరేజీ

  1. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ: ఎన్టీఏలో సంస్కరణలకు రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులు ఏమయ్యాయి?

  2. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపుపై ఐటీ శాఖ ఏమంది?

    నరేంద్ర మోదీ, వీడియో తొలగింపు, మెటా

    ఫొటో సోర్స్, Ajay Aggarwal/Hindustan Times via Getty Images

    ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన ఒక పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ (మెటా) భారతదేశంలో కొద్దిసేపు తొలగించింది. ఈ వ్యవహారాన్ని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ 'తీవ్ర ఆందోళనకరమైన విషయం' అని వ్యాఖ్యానించారు.

    "ప్రధాని అధికారిక హ్యాండిల్ నుంచి ధ్రువీకరించిన కంటెంట్‌ను తొలగించడం తీవ్రమైన విషయం. ఇలా జరిగి ఉండకూడదు" అని ఏఎన్ఐ వార్తాసంస్థతో కృష్ణన్ అన్నారు.

    ఈ విషయంలో మెటా సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పడం మంచి పరిణామమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

    అయినప్పటికీ, "మెటా దీనికి సాంకేతిక లోపాన్ని కారణంగా చూపిస్తోంది, కానీ ఈ వివరణ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై వారి నుంచి మరిన్ని వివరాలు కోరాం. అసలు ఇలాంటి పరిస్థితి ఎలా తలెత్తిందో అర్థం చేసుకోవడానికి సాంకేతిక స్థాయిలో సమావేశం నిర్వహిస్తాం" అన్నారు.

    భారతదేశంలోని ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటోందని ఐటీ కార్యదర్శి తెలిపారు.

    "ఒకసారి ఖాతా వెరిఫై అయిన తర్వాత, అందులో పోస్ట్ చేసిన కంటెంట్ ఇలాంటి స్వల్ప సాంకేతిక లోపాలు లేదా పొరపాట్ల వల్ల తొలగించకుండా చూసుకోవాలి. ఇది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన సంస్కరణల కోసం ఈ అంశాన్ని మేం నిరంతరం పర్యవేక్షిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

    ప్రధాని మోదీకి చెందిన ఏ పోస్ట్‌ను ఫేస్‌బుక్ తొలగించిందనే విషయమై అధికారికంగా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే, జులై 23న పోస్ట్ చేసిన ఒక వీడియోను తొలగించారని, అందులో ప్రధాని మోదీ యువతను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారని వార్తాసంస్థ 'పీటీఐ' రిపోర్ట్ చేసింది

  3. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా: పేపర్ లీకేజీలను అడ్డుకునే ప్రతిపాదిత చట్టంలో ఇంకా ఏముంది?

  4. రంపచోడవరం: 'షైనింగ్ స్టార్' అవార్డు సాధిస్తానంటూ చంద్రబాబుకు మాట ఇచ్చి.. అంతలోనే మృతి, అసలేం జరిగింది?

  5. అరుణాచలం: అడుగు వెడల్పున్న ‘మోక్ష మార్గం’లో చిక్కుకుని మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు

  6. ఎన్నికల్లో పోటీ వయసు 21ఏళ్లకు తగ్గించాలా...రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు కారణమేంటి?

  7. నెతన్యాహును అరెస్టు చేసే అధికారం నాకు లేదు: మమ్దానీ

    అమెరికా, న్యూయార్క్, ఇజ్రాయెల్, నెతన్యాహు

    ఫొటో సోర్స్, Michael M. Santiago/Getty Images

    ఫొటో క్యాప్షన్, న్యూయార్క్ మేయర్

    ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాటల యుద్ధం లేదా ఆరోపణల పర్వంలో పాల్గొనడంపై తనకు ఆసక్తి లేదని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ అన్నారు.

    నెతన్యాహు న్యూయార్క్ వస్తే అరెస్టు చేయడానికి సంబంధించిన ప్రశ్నలకు మమ్దానీ స్పందించారు.

    అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యల గురించి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో చర్చించారా అని అడగ్గా, ట్రంప్‌తో జరిగిన తన సంభాషణను బహిరంగంగా వెల్లడించబోనని మమ్దానీ అన్నారు.

    న్యూయార్క్ ప్రజలందరికీ భద్రత కల్పించడమే తన ప్రాధాన్యత అని స్పష్టంచేశారు.

    నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై మమ్దానీ స్పందించలేదు.

    అంతకుముందు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు సెప్టెంబరు చివరిలో తాను న్యూయార్క్ వెళ్తానని నెతన్యాహు చెప్పారు.

    మమ్దానీ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని నెతన్యాహు ఆరోపించారు.

    నెతన్యాహు న్యూయార్క్‌కు వస్తే అరెస్టు చేస్తానని గతంలో జోహ్రాన్ మమ్దానీ హెచ్చరించారు.

    ఆ తర్వాత తన ప్రకటనను ఆయన ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) జారీ చేసిన అరెస్టు వారెంట్ ఆధారంగా నెతన్యాహును అరెస్టు చేయడానికి చట్టపరమైన అధికారం తనకు లేదని ఆయన అంగీకరించారు.

  8. ‘పచ్చని గడ్డి రక్తంతో తడిసి ఎర్రగా మారింది’

  9. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026: ఈశా సింగ్‌కు బంగారు పతకం.. మను భాకర్‌కు కాంస్యం

    భారత యువ షూటర్ ఈశా సింగ్, ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్

    ఫొటో సోర్స్, Sanket Wankhade/Hindustan Times via Getty Images

    ఫొటో క్యాప్షన్, భారత యువ షూటర్ ఈశా సింగ్

    ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026 మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత యువ షూటర్ ఈశా సింగ్ బంగారు పతకం సాధించింది. ఇదే పోటీలో, మను భాకర్ కాంస్య పతకం గెలిచింది.

    21 ఏళ్ల ఈశా సింగ్ ఫైనల్ పోరులో 40 హిట్స్ స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన జాంగ్ యుయును వెనక్కి నెట్టి ఆమె గోల్డ్ మెడల్ గెలవగా, చైనా షూటర్ 37 హిట్స్ స్కోరుతో సిల్వర్ మెడల్‌కే పరిమితమైంది.

    కాంస్య పతకం కోసం జరిగిన షూట్-ఆఫ్‌లో మను భాకర్ విజయం సాధించింది. ఆ తర్వాత ఫైనల్లో 28 స్కోరుతో ఆమె మూడో స్థానాన్ని దక్కించుకుంది.

    ఈశా సింగ్‌కు ఈ ఏడాది ఇది రెండో పెద్ద టైటిల్. అంతకుముందు మే నెలలో జరిగిన మ్యూనిచ్ వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లోనూ ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది.

    మరోవైపు, మ్యూనిచ్‌లో నిర్వహించిన అదే పోటీల్లో 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో కూడా ఆమె సిల్వర్ మెడల్ సాధించింది.

  10. నరేంద్ర మోదీ: పరాజయం లేని రాజకీయ జీవితంలో ఇప్పుడు ఎందుకు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు...

  11. జర్నలిస్టుల సమస్యలపై దిల్లీలో తెలంగాణ పాత్రికేయుల ధర్నా

    టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా

    ఫొటో సోర్స్, TWJF

    ఫొటో క్యాప్షన్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన "ఛలో పార్లమెంట్" పిలుపులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జర్నలిస్టులు దిల్లీ వెళ్లారు.

    దేశవ్యాప్తంగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణకు చెందిన జర్నలిస్టులు సోమవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు.

    తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ఇచ్చిన "ఛలో పార్లమెంట్" పిలుపులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జర్నలిస్టులు దిల్లీ వెళ్లారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ నిరసనను, దిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు మారూఫ్ రజా ప్రారంభించారు.

    ఈ సందర్భంగా మారూఫ్ రజా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జర్నలిస్టులు దిల్లీ వేదికగా ముందుండి పోరాడటాన్ని ఆయన అభినందించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు జర్నలిస్టు ప్రతినిధులు కూడా ఈ ధర్నాకు హాజరై తమ మద్దతు తెలిపారు.జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య స్పష్టం చేశారు.

  12. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తప్పించండి: తెలంగాణ హైకోర్టు, అమరేంద్ర యార్లగడ్డ, బీబీసీ ప్రతినిధి

    ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్, తెలంగాణ హైకోర్టు

    ఫొటో సోర్స్, BBC/HYDRAA

    ఫొటో క్యాప్షన్, కోర్టు ధిక్కరణకు పాల్పడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ స్థానం నుంచి రిలీవ్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

    హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సోమవారం తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

    కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసిందని ది హిందూ రిపోర్టు చేసింది.

    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామంలో జులై 17న హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ కూల్చివేతలు చేపట్టిన స్థలం సర్వే నం.1, 2 పరిధిలోకి వస్తాయని, అది తమ భూమిగా చెబుతూ శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్చన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, జులై 17న కూల్చివేతలు చేపట్టిన ప్రాంతంలో ప్రైవేటు స్థలాలు లేవని హైడ్రా స్పష్టం చేసింది.

    ‘‘ఇప్పటికే రెండు కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగులో ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ 17వ తేదీన హైడ్రా భారీ బలగంతో వచ్చి ప్రహారీ, ఇతర నిర్మాణాలు కూల్చివేసింది’’ అని పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.హరీశ్ కుమార్ తెలంగాణ హైకోర్టుకు తెలిపారు.

    లోతుకుంట గ్రామంలోని 40 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నాయని, 2021లోనే హైకోర్టు తీర్పు చెప్పిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు తీర్పు అమలు కాకపోవడంపై గతంలో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసినట్లుగా వివరించారు. దీనిపై జులై 27న మరోసారి తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు రావడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

    హైడ్రా కమిషనర్‌పై మొత్తం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగులో ఉన్నాయని తెలగాణ హైకోర్టు చెప్పినట్లు ది హిందూ రిపోర్టు చేసింది.

    ఈ నేపథ్యంలో పదేపదే కోర్టు ధిక్కరణకు పాల్పడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ స్థానం నుంచి రిలీవ్ చేసి ఆ స్థాయి అధికారిని వేరొకర్ని నియమించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

  13. E20 వివాదం: ఎక్స్, మెటా, గూగుల్‌లపై సివిల్ దావాకు గడ్కరీకి హైకోర్టు అనుమతి

    E20, నితిన్ గడ్కరీ, బాంబే హైకోర్టు

    ఫొటో సోర్స్, Prakash Singh/Bloomberg via Getty Images

    ఫొటో క్యాప్షన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

    సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో తనకు పరువు నష్టం కలిగించేలా ఉన్న డీప్‌ఫేక్, ఏఐ పోస్టులపై సివిల్ దావా దాఖలు చేయడానికి కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.

    లైవ్ లా వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం జస్టిస్ అభయ్ అహూజా ధర్మాసనం ఈ కేసును విచారించింది. గడ్కరీ తరఫున న్యాయవాది సందీప్ ఎస్. లడ్డా హాజరై, ఈ దావా వేయడానికి కోర్టు అనుమతి కోరారు.

    దాంతో ఎక్స్, మెటా, గూగుల్‌తో పాటు ఇతర గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ కేసు దాఖలు చేయడానికి కోర్టు గడ్కరీకి అనుమతినిచ్చింది. ఈ వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని, తనకు తగిన ఉపశమనం కలిగించాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.

    రూ. 11 కోట్ల నష్టపరిహారం డిమాండ్

    ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ద్వారా గడ్కరీ, ఆయన కుటుంబ సభ్యులు ఆర్థికంగా లాభపడ్డారంటూ ఈ పోస్టుల ద్వారా తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ఈ ప్రకటనల్లో అవినీతి, పక్షపాతం, స్వార్థ ప్రయోజనాలు, పదవి దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలు చేశారనీ గడ్కరీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పరువు నష్టం కలిగించేలా ఉన్న ఇలాంటి 24 పోస్టులను గడ్కరీ తన పిటిషన్‌లో ప్రస్తావిస్తూ, వాటిని తొలగించాలని కోరారు. తన అనుమతి లేకుండా డీప్‌ఫేక్ రూపంలో తన గుర్తింపును, ప్రతిష్ఠను వాడుకోవడం వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆయన వాదించారు. ఈ మేరకు రూ. 11 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.

    ఇ20, అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, ANI

    E20 కి వ్యతిరేకంగా పోరాడుదాం: కేజ్రీవాల్

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత, ఇకపై ‘E20’ కి వ్యతిరేకంగా గళం విప్పుతామని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

    సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ "దేశ యువత ఒక అహంకార ప్రభుత్వాన్ని తలవంచేలా చేసింది, దాంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంలోనే E20 ఇంధనం సమస్యను కూడా పరిష్కరించాలని ప్రధానమంత్రి మోదీని కోరుతున్నాను. ప్రజలు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు, వారి వాహనాలు పాడవుతున్నాయి" అన్నారు.

    "ఈ అంశంపై అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి, ఈ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి E20కి వ్యతిరేకంగా నేషనల్ టౌన్‌హాల్ నిర్వహిస్తున్నాం" అన్నారు.

  14. పాములకు పాలు తాగించడం వాటి ప్రాణాలకు ప్రమాదకరమా, బలవంతంగా తాగిస్తే వాటి శరీరంలో ఏం జరుగుతుంది?

  15. లంబర్ జాక్: మొద్దులు నరికే వరల్డ్ కప్‌లో రికార్డులు సృష్టించిన అమ్మాయి...

  16. సౌదీ-అమెరికా అణు ఒప్పందం: పాకిస్తాన్ గురించి వ్యక్తమవుతున్న ఆందోళనలేంటి?

  17. వయసు 92... 68 ఏళ్లుగా ఆపరేషన్లు చేస్తున్న సర్జన్

  18. గుండెకు స్టెంట్ వేస్తే ఎన్ని రోజుల తరువాత నుంచి సెక్స్‌లో పాల్గొనవచ్చు?

  19. మగవాళ్లకు కనిపించని రంగులు మహిళలకు కనిపిస్తాయా?

  20. స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావదేకర్, రమేశ్ పోఖ్రియాల్, ధర్మేంద్ర ప్రధాన్.. విద్యా శాఖలో ఏ మంత్రీ ఎక్కువ కాలం ఎందుకు నిలవలేకపోయారు?