విద్యార్థులపై నిరసనలపై సోనియా గాంధీ ఏమన్నారు?

ఫొటో సోర్స్, ANI
విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం, సంస్కరణలు కావాలని విద్యార్థులు డిమాండ్ చేశారని, అయితే వారి ధైర్యానికి మోదీ ప్రభుత్వం "పిరికితనం, క్రూరత్వంతో" సమాధానమిచ్చిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం అన్నారు.
"ప్రభుత్వం విద్యార్థులను దేశ భవిష్యత్తును నిర్మించే పౌరులుగా కాకుండా, దేశానికి శత్రువులుగా చూసింది" అని సోనియా అన్నారని పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది.
మోదీ ప్రభుత్వం భారతదేశ విద్యా వ్యవస్థను బలహీనపరిచిందని సోనియా ఆరోపించారు. దేశ విద్యార్థులు మోదీ ప్రభుత్వ వాదనలను, అహంకారాన్ని బట్టబయలు చేశారని ఆమె అన్నారు.
విద్యార్థులకు అండగా నిలబడి, వారి భవిష్యత్తును కాపాడటం మన నైతిక, రాజకీయ, రాజ్యాంగ బాధ్యత అని సోనియా గాంధీ అన్నారు.
నీట్-యూజీ పరీక్ష పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత జంతర్ మంతర్ వద్ద తమ నిరసనను కొనసాగిస్తున్నారు.
అయితే, ఈ డిమాండ్కు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన దీక్షను విరమించారు.



